ప్రక్రుతి అయిన తల్లితో మమేకం కండి, తండ్రి అయిన దేవుని ప్రేమించండి. ఒక ఇంటిలో తల్లిదండ్రులను గమనించండి. తండ్రి బయటకు వెల్లి డబ్బులు తెస్తాడు, తల్లి పిల్లల పెంపకము చూస్తుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లి ఎక్కువగా దండిస్తుంది. ఇదే ధర్మాన్ని మనం ప్రక్రుతికి, దేవునికి అన్వయించుకొవాలి.
సమస్యలు , భాధలు తల్లి వెసే శిక్ష లాంటిదే. తల్లి దండించింది అంటె నువ్వు తప్పు చేసావని,ధర్మము తప్పావని అర్థం.మనకున్న అయిదు ఇంద్రియాలను ప్రక్రుతికి అనుగుణంగా ఉందేటట్లు చూసుకొవాలి. కళ్ళు మంచినే దర్శించనీ, చెవులు మంచినే వినని, శ్వాస తల్లి శ్వాసతో(earth resonance) ఎకకాలికగ ఉండని, నోరు మంచి అహరమే తీసుకొనని, శరీరము పరిశుభ్రముగ ఉండని. పంచేంద్రియాలు వర్తమానములొ ఉంటూ , ప్రక్రుతితో మమేకమై ఉండని.
మనిషి పుట్టింది, తల్లితో (ప్రక్రుతి) మమేకమై , తండ్రిని (దేవుని) తెలుసుకొని దివ్యజేవనము గడపమని. దివ్యజేవనము అలవాటు కావాలంటె, ప్రక్రుతిపై, దేవునిపై భక్తి ప్రేమ కలగాలి. భక్తి కి వైరాగ్యం కావాలి. వైరాగ్యం సత్కర్మలు,శాకాహారము వల్లనె సాధ్యం.
కలియుగములో మనిషి మరిచిపోయింది గుర్తుచేసారు.ఇది సత్యయుగం రావటనికి సూచన