దీపావళి శుభాకాంక్షలు.
మన పురాణాలలో త్రిమూర్థులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుడు వారి భార్యలు సరస్వతీదేవి, లక్ష్మిదేవి , పార్వతిదేవి.
మనకున్న మూడు శరీరాలు- భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాల లాగనే, తండ్రి అయిన భగవంతుడిని మూడు ప్రపంచాలు- భౌతిక, సూక్ష్మ, కారణ ప్రపంచాలని ఆయనకున్న మూడు శరీరాలుగా గుర్తించాలి.వీటినే భగవంతుడి సకారరూపాలుగా మనము గుర్తించాలి. వీటినే శరీరము , మనసు, బుద్ది అని గత పుటల్లో తెలుసుకొన్నాము. ఈ సకారరూపాలనే పార్వతిదేవి, లక్ష్మిదేవి, సరస్వతీదేవి గా మన ఋషులు వర్ణించారు. కనిపించే భౌతిక ప్రపంచము(UNIVERSE) పార్త్వతీదేవి రూపము, ప్రపంచాన్ని నడిపిస్తున్న డబ్బు (MONEY) లక్ష్మీదేవి రూపము , విజ్ఞానము(SCIENCE) సరస్వతీదేవి రూపము.
మనకున్న మూడు శరీరాలకు శక్తి నిస్తున్న- కుండలిని, హ్రుదయము, ఆత్మ లాగానే , తండ్రి అయిన భగవంతుడిని మూడు ప్రపంచాలకి శక్తి నిస్తున్న- భౌతిక శక్తి , ప్రేమ , ఆనందము లను మహేశ్వరుడు, విష్ణు , బ్రహ్మ లుగా మన ఋషులు వర్ణించారు.
ఈ దీపావళి రోజు మనము లక్ష్మీ దేవిని పూజిస్తాము. అంటే తండ్రి అయిన పరమాత్మ సూక్ష్మరూపాన్ని ధ్యానిస్తూ మన సూక్ష్మరూపమయిన మనసు లేక చెడు ఆలోచనలను తొలగించుకోవడనికి మనము ప్రయత్నము చేయాలని గుర్తుచేసుకొంటాము. భగవంతుని సూక్ష్మరూపమయిన లక్ష్మీ దేవిని ఆశీర్వదించమని కోరుకొంటాము.